అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని ఓటర్ల ముసాయిదా జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా విడుదల చేశారు. ఈనెల 9 నాటికి రాష్ట్రంలో మొత్తం మూడు కోట్ల 98 లక్షల మంది ఓటర్లు ఉన్నారని ప్రకటించారు. వీరిలో రెండు కోట్ల ఒక వెయ్యి మంది మహిళా ఓటర్లు, కోటి 97 లక్షల మంది పురుష ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. వివిధ కారణాలతో 10.52లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించామని వివరించారు.
మృతులు, డూప్లికేట్, ఒకే పేరుతో వేర్వేరు చోట్ల ఉన్న ఓట్లను ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా గుర్తించి నకిలీ ఓటర్ల పేర్లను తొలగించామన్నారు. 18-19 ఏళ్ల వయసున్న ఓటర్లు 78,438 మంది ఉన్నారని, 68,115 సర్వీస్ ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఓటర్-ఆధార్ అనుసంధాన ప్రక్రియ 60శాతం పూర్తయిందని తెలిపారు. ఓటరు కార్డు కోసం ఆధార్ను తప్పనిసరి చేయడం లేదని స్పష్టం చేశారు.