తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో ధనుర్మాసఉత్సవాలను అత్యంత ముఖ్యమైనవిగా భావిస్తారు. డిసెంబరు 16వ తేదీన నుంచి ధనుర్మాసం ప్రారంభం కానున్నది. డిసెంబర్ 16 మధ్యాహ్నం 12.26 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాల్లోభాగంగా డిసెంబరు 17వ తేదీ నుంచి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవకు బదులు తిరుప్పావై పారాయణం చేస్తారు.
డిసెంబర్ 16న ప్రారంభం కానున్న ధనుర్మాస ఉత్సవాలు 2022 జనవరి 14న ముగియనున్నాయి.