హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్గా దమ్మాలపాటి శ్రీనివాస్ నియమితులయ్యారు.
2014-19 మధ్య కాలంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆయన ఏజీగా వ్యవహరించారు. తాజాగా మళ్లీ టీడీపీ అధికారంలోకి కావడంతో సీఎం చంద్రబాబు దమ్మాలపాటినే ఎంపిక చేశారు. ఈ మేరకు సీఎం ముఖ్యకార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ఉత్తర్వులు జారీ చేశారు.