అమరావతి : దేవుడ్ని ప్రసన్నం చేసుకోవడానికి రకరకాల నైవేద్యం సమర్పించడం అనాధిగా వస్తున్న సంప్రదాయం. అయితే ఇక్కడ మాత్రం తేళ్లను నైవేద్యంగా పెట్టి తమ మొక్కలను తీర్చుకుంటున్నారు కర్నూలు జిల్లా కోడుమూరులోని వేంకటేశ్వర స్వామి భక్తులు. స్వామివారు కొండపై వెలియడంతో కొండల రాయుడు వేంకటేశ్వరస్వామి ఆలయంగా పేరుగాంచిన ఆలయంలో ప్రతి ఏటా శ్రావణమాసం మూడో సోమవారం ప్రత్యేక ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.
దీంట్లో భాగంగా నిన్న భక్తులకు కొండపై దొరికిన తేళ్లను నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకు న్నారు. తాము కోరిన కోరికలు తీర్చాలని వేడుకున్నారు. పెద్దలే కాకుండా చిన్నపిల్లలు సైతం భయం లేకుం డా తేళ్లను పట్టుకోవడం చూడడానికి వింతగా ఉన్నా ఈ ఆచారం కొన్నేళ్లుగా కొనసాగుతుండడం విశేషం.
ఈసారి వేడుకలకు జిల్లాతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కొండపైన ఉన్న రాళ్ల కింద తేళ్ల కోసం అన్వేషణ చేపట్టి వాటిని పట్టుకుని నైవేద్యం సమర్పించారు.