అమరావతి : ఏపీలోని బాపట్ల జిల్లా వేటపాలెం స్టేషన్లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది . చెన్నై నుంచి విజయవాడకు వెళ్తున్న గూడ్స్ రైలు సాంకేతిక కారణాలతో వేటపాలెం స్టేషన్లో నాలుగు బోగీలుపట్టాలు తప్పాయి. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే పలు రైళ్లకు అంతరాయం ఏర్పడింది. రైల్వే సాంకేతిక సిబ్బంది వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టారు.