అమరావతి : రైల్వే ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగు పరిచేందుకు గాను పశ్చిమ గోదావరి జిల్లా నరసా పురం రైల్వే అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నారు. ఏళ్ల తరబడి రైల్వే స్థలాలను ఆక్రమించు కుని నివాసముం టున్న ఇండ్లను ఇవాళ ఆర్పీఎఫ్, పోలీసుల సహకారంతో తొలిగించారు. సుమారు వంద మీటర్ల వరకు ఉన్న రైల్వే స్థలాలను కొందరు స్థానికులు ఆక్రమించుకుని ఇండ్లను నిర్మించుకున్నారు.
వీటిని తొలిగించాలని పలుమార్లు రైల్వే అధికారులు సూచించినా పట్టించుకోలేదు. వాటిని తొలిగించేందుకు వచ్చే వారిని స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో పనులను నిలిపివేశారు. అయితే ఈసారి ముందస్తుగా ఇళ్ల యజమానులకు నోటీసులు అందజేయడంతో పాటు వారికి నచ్చజెప్పడంతో విజయవంతమైన అధికారులు ఇవాళ జేసిబిలతో సహాయంతో నేలమట్టం చేశారు.
ఆక్రమణల వల్ల వాహనదారులకు, ప్రయాణికుల రాక పోకలకు ఇబ్బందికరంగా మారిందని పోలీసులు తెలిపారు. రైల్వేస్టేషన్ అభివృద్ధికి రైల్వే శాఖ నిధులు మంజూరు చేసినందును రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా స్థానిక నెక్లెస్ రోడ్డు నుంచి స్టేషన్ రోడ్డు వరకు సుమారు 100 మీటర్లకు వరకు ఉన్న ఆక్రమణలు తొలిగించారు.