అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ద్విచక్రవాహనానికి కట్టేసిన మామఅల్లుళ్ల మృతదేహాలు చెరువులో లభ్యం కావడం సంచలనం సృష్టిస్తోంది . కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం చిన్నగొల్లపాలెం చెరువులో సోమవారం మామ, అల్లుడు మృతదేహాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వీరిద్దరు గత శనివారం కనిపించకుండా పోయారు.
అప్పటి నుంచి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు గాలింపు మొదలు పెట్టారు.గ్రామస్థుల సాయంతో మృతదేహాలు వెలికితీసిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అయితే వీరిది ఆత్మహత్య, హత్యా? అనే కోణంలో పోలీసులు దర్యా ప్తు చేస్తున్నారు.