అమరావతి : ఆంధ్రప్రదేశ్కు అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు రెండోసారి మహా పాదయాత్రకు ముహుర్తం ఖరారు చేశారు. అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి నాయకులు ఇవాళ మీడియా సమావేశాన్ని నిర్వహించి అమరావతి రైతు మహాపాదయాత్ర -2 ఆవశ్యక త, విధివిధానాలను వెల్లడించారు. పాదయాత్ర నమోదుకు సంబంధించ ప్రత్యేక యాప్ను ఈ సందర్భంగా నాయకులు ఆవిష్కరించారు.
సెప్టెంబర్ 12 నుంచి అమరావతి- అరసపల్లి వరకు మహాపాద యాత్రను నిర్వహిస్తున్నట్లు అమరావతి ఐకాస కన్వీనర్ శివారెడ్డి పేర్కొన్నారు. పాదయాత్రకు సంబంధించి రెండు రోజుల్లో సమగ్ర నివేదిక డీజీపీకి అంద జేస్తామని ప్రకటించారు. కోర్టు చెప్పినా తీర్పునకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు.
రాజకీయ స్వలాభంతోనే రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు. అమరావతిని ప్రభుత్వం ప్రకటిస్తే ఆందోళన విరమిస్తామని మరోనేత తిరుపతి రావు వివరించారు. రాష్ట్ర భవిష్యత్తు కాంక్షించే అన్ని జిల్లాలు యాత్రలో పాల్గొనవచ్చని సూచించారు.