అమరావతి : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద ( YS Vivekananda) హత్యకేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి (Dastagiri) తెలంగాణ ప్రభుత్వానికి భద్రత కల్పించాలని కోరాడు. కేసులో అప్రూవర్గా మారినందుకుగాను వైసీపీ ప్రభుత్వం తనను బెదిరిస్తోందని, ఆ ప్రభుత్వంతో ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. తనకు భద్రత కల్పించాలని సీఎం రేవంత్రెడ్డి(CM Revanth) కి మంగళవారం విజ్ఞప్తి చేశాడు. తాను ఎవరినీ కిడ్నాప్ చేయలేదని, కావాలనే ప్రభుత్వం తనను కేసులో ఇరికిస్తుందని వాపోయాడు.
2019 మార్చి 15 తెల్లవారుజామున పులివెందుల( Pulivendula) లోని నివాసంలో వైఎస్ వివేకానంద దారుణ హత్యకు (Murder) గురయ్యాడు. ఈ హత్యలో ప్రమేయం ఉందంటూ ప్రధాన కారకుల్లో నలుగురిలో ఒకరైన దస్తగిరిని అరెస్టు చేసి రిమాండ్లో ఉంచారు. దస్తగిరి అభ్యర్థన, కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు అతడికి భద్రత కల్పించారు. అయితే తనకు ఏపీ ప్రభుత్వంపై నమ్మకం లేదని, ఆ ప్రభుత్వంతో ప్రాణహాని ఉందని తనకు భద్రత కల్పించాలని తెలంగాణ సీఎం రేవంత్ను కోరాడు.