అమరావతి ,మే 7 :సింహాచలంవరాహలక్ష్మీనృసింహస్వామివారి దేవాలయంలోమే 10వ తేదీ నుంచి మే15 తేదీ వరకు భక్తులకు దర్శనాలు రద్దు చేసారు. అర్చకుల విజ్ఞప్తి మేరకు, ధర్మకర్తల మండలి ఆమోదంతో ఆలయాన్ని మూసివేయాలని అధికారులునిర్ణయించారు. ఏడాదిలోనే అతిపెద్ద ఉత్సవంగా జరిపే చందనోత్సవాన్ని ఈసారి ఏకాంతంగానే నిర్వహించనున్నారు. లక్ష మందికిపైగా తరలివచ్చే ఉత్సవమే అయినా ప్రజల ఆరోగ్యం దృష్యా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆలయ ఈవో సూర్యకళగారు తెలిపారు. కాబట్టి భక్తులెవరూ సింహాచలం కొండపైకి రాకూడదని విజ్ఞప్తి చేశారు.