అమరావతి : ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఇవాళ రాజరాజేశ్వర దేవిగా దర్శనమిచ్చింది . అమ్మ వారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి భవానీ భక్తులు పెద్ద సంఖ్య లో విజయవాడకు తరలిరావడంతో తెల్లవారుజాము నుంచే ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడింది. నవ రాత్రి ఉత్సవాలు చివరి రోజు కావడంతో రూ. 100, రూ.300 టికెట్లను నిలిపివేశారు. ఈ సందర్భంగా భక్తుల కోసం అధికారులు, పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.