తిరుపతి : తిరుపతి కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో (Brahmotsavam) భాగంగా గురువారం స్వామివారు సూర్యప్రభ (Suryaprabha) వాహనంపై దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ నాలుగు మాడ వీధుల్లో వాహనసేవ వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
అనంతరం సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనాన్ని (Thirumanjanam) వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంలతో స్వామివార్లను అభిషేకం చేశారు. వాహనసేవలో తిరుమల పెద్దజీయర్స్వామి, చిన్నజీయర్స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, ఏఈవో పార్థసారధి, భక్తులు పాల్గొన్నారు.