అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గడిచిన ఏడాదికాలంగా సైబర్ నేరాలు పెరిగాయని ఏపీ డీజీపీ రాజేంధ్రనాథ్ రెడ్డి తెలిపారు. బుధవారం క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 2022లో జరిగిన నేరాలు, దోపిడీ, దొంగతనాలు, హత్యలు తదితర వాటిని వివరించారు. ఈ ఏడాది 2700 సైబర్ క్రైం కేసులు నమోదు అయ్యాయని వెల్లడించారు.
పోలీసు అధికారులకు సైబర్ నేరాలను అదుపులో ఉంచడానికి నాలుగు చోట్ల రీజినల్ సైబర్ సెంటర్స్ పెట్టి శిక్షణ ఇస్తామని తెలిపారు. సైబర్ నేరాలు కాకుండా ఈ ఏడాది ఏపీలో క్రైం రేటు తగ్గిందని అన్నారు. గతేడాది కంటే 60 వేల కేసులు తక్కువ నమోదు అయ్యాయని తెలిపారు. ఏపీలో పెండింగ్ కేసుల సంఖ్య తగ్గిందని వెల్లడించారు. లోక్ అదాలత్లో 57 వేల కేసులను పరిష్కరించామని డీజీపీ తెలిపారు.
శిక్షలు పడే శాతం పెంచేందుకు పాలసీ పరంగా మార్పులు చేస్తున్నామని అన్నారు. అత్యాచారాలు, హత్యకేసుల్లో 44 మందికి శిక్ష పడిందన్నారు. 88.5శాతం కేసుల్లో చార్జిషీట్లు వేశామని ఆయన పేర్కొన్నారు.