తూర్పు గోదారి : రాజమండ్రిలోని 42వ సీఆర్పీఎఫ్ బెటాలియన్ పెద్ద ఎత్తున మొక్కలు నాటింది. రాజమండ్రిలోని ప్రాంతీయ అటవీ పరిశోధన కేంద్రం, ఏపీ ఫారెస్ట్ అకాడమీ క్యాంపస్లో ప్లాంటేషన్ డ్రైవ్ చేపట్టారు. సీఆర్పీఎఫ్కు చెందిన పోలీసులు పెద్ద సంఖ్యలో పాల్గొని తలా పది మొక్కలు నాటారు. ఈ ప్లాంటేషన్ డ్రైవ్ను 42 వ బెటాలియన్ కమాండెంట్ సతీష్ కుమార్ మొక్క నాటి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో సెకండ్ ఇన్ కమాండ్ జీ సురేష్ బాబు, సెకండ్ ఇన్ కమాండ్ సెంథిల్ కుమార్, ఇతర అధికారులు, 42 బెటాలియన్ జవాన్లు పాల్గొన్నారు. అటవీ శాఖ తరఫున ఏపీఎస్ఎఫ్ఏ డిప్యూటీ డైరెక్టర్ ఎంవీ ప్రసాద రావు, రాష్ట్ర సిల్వికల్చరిస్ట్ ఎల్ భీమయ్య, అసిస్టెంట్ శివరామ్ తదితరులు కూడా పాల్గొని మొక్కలు నాటారు. మొత్తం 110 మంది అధికారులు, జవాన్లు పాల్గొని 1000 రకాల మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా 42 వ బెటాలియన్ కమాండెంట్ సతీష్ కుమార్ మాట్లాడుతూ, వర్షాకాలంలో ఎంత వీలైతే అన్ని మొక్కలు నాటేలా సీఆర్పీఎఫ్ సిబ్బందికి చెప్తుంటామని, ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు మరిన్ని చేపట్టి రాజమండ్రిని గ్రీన్సిటీగా మార్చేందుకు కృషిచేస్తామని చెప్పారు. ఎన్ని మొక్కలు నాటితే భవిష్యత్ అంత పచ్చగా ఉంటుందని, ప్రతి ఇంటి ముందు ఒక మొక్క ఉండేలా చూసుకుంటే వాతావరణ కాలుష్యం లేకుండా చూసుకోవచ్చునని సూచించారు.