తిరుమల : తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన శ్రీవారి భక్తులు స్వామివారి దర్శనానికి ఒక కంపార్టుమెంట్లో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 67,284 మంది భక్తులు దర్శించుకోగా 19,064 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు మొక్కుల ద్వారా హుండీకి రూ. 4.27 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు.