తిరుమల : తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఆపద మొక్కులవాడు వేంకటేశ్వరస్వామి దర్శనానికి టోకెన్లతో వచ్చిన భక్తులు నేరుగా దర్శనం చేసుకుంటున్నారు. టోకెన్లు లేని భక్తులకు 6 గంటల్లో సర్వదర్శనం( Sarvadarsan) అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న శ్రీవారిని 73,599 మంది భక్తులు దర్శించుకోగా 16,069 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి రూ. 3.21 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు.