తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్ట్మెంట్లన్నీ( Compartments) నిండిపోయి బాట గంగమ్మ ఆలయం వరకు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం (Sarvadarsan) కలుగుతుందని ఆలయ అధికారులు వివరించారు.
నిన్న స్వామివారిని 63,628 మంది భక్తులు దర్శించుకోగా 33,548 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.4.26 కోట్లు వచ్చిందన్నారు.