అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ఆరోపణలను ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి (Minister Peddireddy ) తిప్పికొట్టారు. ఇసుక, లిక్కర్, భూ మాఫియా అంటూ తనను విమర్శించిన చంద్రబాబు రాష్ట్రంలో గెలిచే పరిస్థితులు లేవని పేర్కొన్నారు. రాజకీయంగా తనను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
కుప్పం నియోజకవర్గానికి కనీసం తాగునీటిని అందించలేని చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలు, చిత్తూరు జిల్లా ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. ముఖ్యమంత్రిగా ఏం చేశాడో చెప్పుకోలేని స్థితిలో చంద్రబాబు(Chandra babu) ఉన్నాడని ఆరోపించారు. మామకు వెన్ను వెన్నుపోటు పొడిచి జిల్లా మొత్తానికి చెడ్డపేరు తీసుకొచ్చారని విమర్శించారు. గతంలో మద్యపాన నిషేధాన్ని(Liquar ban), రూ.2 కిలో బియ్యం పథకాన్ని ఎత్తివేసిందో ఎవరో ప్రజలందరికీ తెలుసని పేర్కొన్నారు. ఇంటికో ఉద్యోగమంటూ నిరుద్యోగులను మోసం చేసిన చంద్రబాబును ఎవరూ నమ్మరని అన్నారు.