అమరావతి : సీపీఐ నాయకుడు నారాయణ కేంద్ర ప్రభుత్వంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర కేబినెట్లో నేరస్థులున్నారని అన్నారు. జార్ఖండ్ సీఎం ను పదవి నుంచి తప్పించాలని కేంద్రం శత విధాల ప్రయత్నించిందని ఆరోపించారు. మోదీ పాలనలో దేవం అధోగతి పాలైందని అన్నారు.
అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటు న్నారని, నిలదీసే ప్రత్యర్థులపై ఈడీ చే దాడులకు పురిగొల్పి భయాందోళనలకు గురి చేస్తుందని మండి పడ్డారు. లిక్కర్ స్కామ్లో కేసీఆర్ కుటుంబాన్ని ఇరికించాలని చూశారని వెల్లడించారు. దేశాన్ని దోచుకుం టున్న అదానీ జోలికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీలు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు.