Cricket Betting | హైదరాబాద్ : విశాఖ నగరంలో భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠా పట్టుబడింది. విశాఖ కేంద్రంగా జరుగుతున్న రూ. 350 కోట్ల క్రికెట్ బెట్టింగ్ దందాను సైబర్ పోలీసులు గుట్టురట్టు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో బెట్టింగ్ చేస్తున్న కింగ్మోను అలియాస్ దినేష్, వాసుదేవ్, సూరిబాబులతో పాటు 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అనామక మొబైల్ అప్లికేషన్స్ ద్వారా బెట్టింగ్ నిర్వహణ చేస్తున్నారు. కాగా ఒక్క కింగ్ మోను అకౌంట్స్ నుంచే రూ.145 కోట్ల లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి నగదు, సెల్ఫోన్లు, ల్యాప్ట్యాప్లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ బెట్టింగ్ ఉచ్చులో విశాఖ పరిసర ప్రాంతాల్లోని వందలాది మంది అమాయక యువకులు చిక్కుకున్నట్లు తెలిపారు. అయితే బెట్టింగ్ ఉచ్చులో పోలీసులకు చిక్కిన విశాఖ పరిసర ప్రాంతాల యువత.. బెట్టింగ్ ముఠాను విడుదల చేయాలని పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. సీపీ రవిశంకర్ స్వయంగా విచారణ చేస్తున్నారు. క్రికెట్ బెట్టింగ్ను నడిపించే ముంబాయి, ఢిల్లీ, హైదరాబాద్కు సంబంధించి బుకీలతో పట్టణ ప్రాంతాలకు చెందిన కొందరు ప్రముఖులు సంబంధాలు పెట్టుకుని ఈ వ్యవహారాన్ని రహస్యంగా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. క్రికెట్ బెట్టింగ్లో భాగంగా పందేలు కాసేవారు బుకీల వద్ద కోడ్ భాష వినియోగిస్తూ అనుమానం రాకుండా కొనసాగిస్తున్నారు.
బుకీల దగ్గర రిజిస్టర్ అయిన నెంబర్ నుంచి ఫోన్ రాగానే స్పందిస్తున్న యువత బెట్టింగ్కు మొగ్గు చూపుతున్నారు. బెట్టింగ్ రాయుళ్లు కోడ్ లాంగ్వేజ్ వాడుతున్నారు. మ్యాచ్ జరిగే రోజున అప్పటికప్పుడే ఆన్లైన్ ద్వారా లావాదేవీలు జరుపుతూ యువత బెట్టింగులో పాల్గొంటున్నారు. క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.