ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు చాలా తగ్గాయి. నిన్నటి కంటే ఇవాళ చాలా తక్కువ సంఖ్యలో పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. అయితే, మరణాలు ఎక్కువ సంఖ్యలో నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తున్నది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో కేసులు నమోదయ్యాయి.
తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా ఏపీలో 3,396 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుంటే 23,00,765 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కరోనా కారణంగా తొమ్మిది మంది మరణించారు. అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందగా.. చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాత పడ్డారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్లో 14,655 మంది చనిపోయినట్లు ప్రభుత్వ నివేదికలు వెల్లడిస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 22,07,364 గా ఉండగా.. ప్రస్తుతం 78,746 యాక్టివ్ కేసులున్నాయి. ఇవాల్టి వరకు ఆంధ్రప్రదేశ్లో 3,26,32,089 నమూనాలు పరీక్షించారు. ఇవాళ అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక్కడ 516 కేసులు వచ్చాయి. కృష్ణా జిల్లాలో 494 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం – 147, చిత్తూరు – 252, గుంటూరు – 360, వైఎస్ఆర్ కడప – 204, కర్నూలు – 205, నెల్లూరు – 197, ప్రకాశం – 240, శ్రీకాకుళం – 46, విశాఖపట్నం – 281, విజయనగరం – 56, పశ్చిమ గోదావరి – 398 చొప్పున పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.