విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. కొత్త కేసులు, మరణాలు భారీగా తగ్గాయి. కొత్తగా ఏపీలో 749 కొత్త కేసులు నమోదయ్యాయి. రెండు రోజుల నుంచి వెయ్యికి తక్కువగా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా ముగ్గురు మరణించారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 22,785 టెస్టులు చేయగా.. 749 మందికి పాజిటివ్ గా నిర్ధరణ అయ్యింది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో 23,12,778 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తాజాగా విడుదల చేసిన బులెటిన్లో వెల్లడించారు. వీరిలో 14,697 మంది మరణించారు.
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 22,79,152 గా ఉంది. 18,929 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకు ఆంధ్రప్రదేశ్లో 3,28,31,785 నమూనాలను పరీక్షించారు. ఈరోజు అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక్కడ 125 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో ఒకొక్కరు చొప్పున కరోనాతో మరణించారు.