అమరావతి : కొవిడ్ (Covid)కొత్త వేరియంట్ కేసులు చాపకింద నీరులా ప్రవహిస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్లో నలుగురికి కరోనా పాజిటివ్ (Positive)కేసులు నమోదు కావడం కలవరానికి గురిచేస్తుంది. వైజాగ్లో ముగ్గురికి, ఏలూరులో ఒకరికి కరోనా పాజిటివ్ను అధికారులు గుర్తించారు. వీరిని ముందు జాగ్రర్త గా ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందజేస్తున్నారు.
కొత్త వేరియంట్ పట్ల ఏపీ సీఎం జగన్ శుక్రవారమే అధికారులతో సమీక్ష నిర్వహించిన రోజే ఈ కేసులు బయట పడ్డాయి. ఏపీలో ముందస్తు చర్యలో భాగంగా ఆక్సిజన్ ఇన్ఫ్రాను(Oxgen Infra), పీఎస్ఏ ప్లాంట్లను, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, డి టైప్ సిలిండర్లను అధికారులు సిద్ధం చేశారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 56, 741 ఆక్సిజన్ బెడ్లు కూడా సిద్ధంగా ఉంచారు.