హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): చిత్తూరు జిల్లాలో విషాదం నెలకొన్నది. అడవిలో నుంచి వచ్చిన ఓ ఏనుగు దాడిలో దంపతులు మృతి చెందిన ఘటన గుడిపాల రామాపురంలో జరిగింది. బుధవారం గ్రామానికి చెందిన వెంకటేశ్-సెల్వి దంపతులు పొలంలో పనులు చేస్తుండగా, ఒక్కసారిగా వారిపై ఏనుగు దాడి చేసింది.
ఈ దాడిలో వారు అక్కడికక్కడే మృతి చెందారు. అదే విధంగా సీకేపల్లిలోనూ ఏడుగు దాడి చేసిన ఘటనలో కార్తీక్ అనే వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి.