అమరావతి: ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల (ఎంపీటీసీ, జడ్పీటీసీ) ఓట్ల లెక్కింపునకు ఏపీ హైకోర్టు అనుమతిణనిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కౌంటింగ్ ఏర్పాట్లపై రాష్ర్ట ఎన్నికల సంఘం కసరత్తు షురూ చేసింది. హైకోర్టు తీర్పు కాపీని పరిశీలించిన అనంతరం లెక్కింపు తేదీలపై నిర్ణయం తీసుకోనుంది.
ఎన్నికల లెక్కింపునకు చేయాల్సిన ఏర్పాట్లు, తదిరత అంశాలపై చర్చించేందుకు సీఎస్, డీజీపీతో ఎస్ఈసీ నీలం సాహ్ని సమావేశం కానున్నారు. లెక్కింపునకు సిబ్బంది ఏర్పాటు, పోలింగ్ కేంద్రాల వద్ద తీసుకోవాల్సిన చర్యలపై ఆ సమావేశంలో చర్చించనున్నారు.