అమరావతి : ఎన్నికల నోటిఫికేషన్తో ఏపీలో ఉన్మాది పాలనకు కౌంట్ డౌన్ ప్రారంభమయ్యిందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు (Chandrababu) పేర్కొన్నారు. ఎన్నికల షెడ్యూల్రావడంతో ఏపీ ( Andhra Pradesh) ప్రజలకు స్వాతంత్య్రం వచ్చినట్టుగా ఉందని వ్యాఖ్యనించారు. రానున్న ఎన్నికల్లో సైకోను ఇంటికి పంపుతున్నామని వెల్లడించారు.
కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఎన్టీయే ప్రభుత్వమే(NDA Government) వస్తుందని సర్వేలన్నీ ప్రకటిస్తున్నాయని , ఇది నిజమని ధీమాను వ్యక్తం చేశారు. ఎవరూ ఊహించని విధంగా ఎన్డీయేకు ఎన్నికల ఫలితాలు రానున్నాయని పేర్కొన్నారు.నోటిఫికేషన్ విడుదలైనందున ఇక ప్రభుత్వానికి భయపడేది లేదని స్పష్టం చేశారు. స్వాతంత్ర పోరాటం తరహాలో రాష్ట్రంలోని ప్రతి పౌరుడు బాధ్యతగా భావించి ఏపీని విముక్తి చేసేలా పోరాడాలని పిలుపునిచ్చారు.
వచ్చే 45 రోజులు ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలబడాలని స్లోగన్తో ముందుకు వెళ్లాలని సూచించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకుపోతుంటే ఏపీలో మాత్రం రాతియుగం వైపు తీసుకెళ్తు న్నారని ఆరోపించారు.