అమరావతి : కరోనా సోకిందన్న భయంతో పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం నడిపల్లి గ్రామంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. నడిపల్లి గ్రామానికి చెందిన షేక్ విలాయత్ ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు.
పరీక్ష చేయించుకోగా విలాయత్కు ఇటీవల పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఏం జరుగుతుందోనన్న ఆందోళనలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి