అమరావతి : శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. జలాశయం 10 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేశుల నుంచి 3,63,157 క్యూసెక్కుల నీరు జలాశయానికి వస్తుండగా స్పిల్వే ద్వారా 3,76,670 క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నీటి మట్టం 885.80 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 884.4గా ఉంది.
శ్రీశైలం జలాశయం పూర్తి నీటి నిల్వ 215.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 212.43 నీటి నిల్వ ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తిని అధికారులు కొనసాగిస్తున్నారు. విద్యుదుత్పత్తి ద్వారా 62,277 క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు.