తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ (Devotees Crowd) కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 20 కంపార్టుమెంట్లు (Compartments) నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం ( Sarvadarsan) కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న 69,314 మంది భక్తులు దర్శించుకోగా 25,165 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 5.48 ఆదాయం (Income) వచ్చిందని తెలిపారు.
ఈనెల 24న కుమారధార తీర్థ ముక్కోటి
తిరుమలలో ఈనెల 24న కుమారధార తీర్థ ముక్కోటి ఘనంగా నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు వివరించారు. తీర్థముక్కోటి రోజున భక్తులు తీర్థ స్నానమాచరించి, దానధర్మాలు చేసి స్వామివారిని దర్శించుకుంటారని తెలిపారు.
వరాహ, మార్కండేయ పురాణాల ప్రకారం శేషాచల గిరుల్లో ఒంటరిగా సంచరిస్తున్న వృద్ధ బ్రాహ్మణుడు వేంకటేశ్వరస్వామిప్రత్యక్షమై ‘‘ ఈ వయసులో చెవులు వినిపించవు, కళ్లు కనిపించవు. అడవిలో ఏంచేస్తున్నావు’ అని ప్రశ్నించగా యజ్ఞయాగాలు ఆచరించి దైవరుణం తీర్చుకోవాలనే తలంపుతో ఉన్నానని సమాధానమిచ్చాడని తెలిపారు. అనంతరం స్వామివారి సూచన మేరకు ఈ తీర్థంలో వృద్ధుడు స్నానమాచరించగా 16 ఏళ్ల నవ యువకుడిగా కౌమార్యంలోకి మారిపోవడం వల్ల ఈ తీర్థానికి ‘కుమార ధార’ అనే పేరు వచ్చిందని అర్చకులు వెల్లడించారు.