తిరుమల : తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో 19 కంపార్టుమెంట్లు (Compartments) నిండిపోయాయి . టోకెన్లు లేని భక్తులకు 10 నుంచి 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ (TTD) అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 63,830 మంది భక్తులు దర్శించుకోగా 30,810 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు మొక్కుల ద్వారా చెల్లించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.20 ఆదాయం (Income) వచ్చిందని తెలిపారు.