అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ ప్రభుత్వం పేదల జీవితాలతో ఆటలాడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. రాష్ట్రంలో బియ్యం బదులు నగదు ఇస్తామనడంలో ప్రభుత్వ కుట్ర కోణం దాగి ఉందని విమర్శించారు. ప్రజలపై బలవంతంగా ఒత్తిడి పెంచుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల సర్వే నిర్వహిస్తే ఎక్కువ మంది బియ్యమే కావాలని కోరుతున్నారని పేర్కొన్నారు.
ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఇంటింటికి రేషన్ పథకాన్ని అటకెక్కించేందుకే ప్రభుత్వం కొత్త నాటకం ఆడుతుందని, పోర్టుల ద్వారా బియ్యాన్ని విదేశాలకు పంపించే ప్రయత్నం చేస్తోందని ఆయన వెల్లడించారు.