YS Jagan | ఏపీ సీఎం వైఎస్ జగన్పై ఏపీ పీసీసీ మాజీ చీఫ్ గిడుగు రుద్రరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆస్తులకు మాత్రమే జగన్ వారసుడు అని.. ఆయన ఆశయాలకు షర్మిలతో పాటు కాంగ్రెస్ శ్రేణులమంతా వారసులమే అని వ్యాఖ్యానించారు. రాజమండ్రిలో ఆదివారం నిర్వహించిన కాంగ్రెస్ ముఖ్య నేతల ఆత్మీయ సమ్మేళనంలో గిడుగు రుద్రరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిడుగు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు.
ఏపీలో ఎన్నికల ప్రచారానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఆహ్వానిస్తామని గిడుగు రుద్రరాజు తెలిపారు. ఏపీలో ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి పార్టీకి వైభవం తీసుకొస్తామని అన్నారు.