అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎస్ ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించా రు. నల్లబ్యాడ్జీలు ధరించి భోజన విరామ సమయంలో ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఏపీ సచివాలయంలో సీపీఎస్ ఉద్యోగులు చేపట్టిన ఆందోళనలకు ఓపీఎస్ ఉద్యోగులు సంఘీభావం తెలిపారు.
ఏపీ పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ కార్యాలయం వద్ద ఏపీ ఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను నిర్వహిం చారు. సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు దాటిపో వస్తున్నా ఇంకా దాటవేసే దోరణి అవలంభిస్తుండడం విచారకరమన్నారు. కాగా సీపీఎస్ రద్దు కోరుతూ ఇవాళ తలపెట్టిన ఛలో విజయవాడను సెప్టెంబర్ 11వ తేదీకి వాయిదా వేసుకుని విద్రోహ దినంగా పాటిస్తామని ఏపీ ఎన్జీవో నేతలు నిర్ణయించారు. ఈ కార్యక్రమాన్ని కూడా ఉద్యోగ సంఘాలు విరమించుకుని నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపాయి.