తిరుపతి,జూలై 3:తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లోని వివిధ విభాగాలలో విధులు నిర్వహిస్తూ మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు చెందిన118 మందికి కారుణ్య నియామకపత్రాలు అందజేశారు. ఈసందర్భంగా టిటిడి ఈవో డా.కె ఎస్.జవహర్ రెడ్డి మాట్లాడుతూ “సాక్షాత్తు శ్రీవారి చెంత ఉద్యోగం చేయడం పూర్వజన్మ సుకృతమని” అన్నారు.తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డితో కలిసి ఈఓ కారుణ్య నియామకపత్రాలు అందజేశారు.
వివిధ పరిపాలనా పరమైన కారణాల వలన పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలకు ప్రభుత్వ అనుమతితో ఉత్తర్వులు ఇస్తున్నట్టు తెలిపారు. వీరిలో 81 మంది జూనియర్ అసిస్టెంట్లు, ఒక అసిస్టెంట్, 20 మంది ఆఫీస్ సబార్డినెంట్స్, ఒక డ్రైవర్, ఏడుగురు ఎమ్పిడబ్లూ, నలుగురు హెల్పర్లు, ముగ్గురు క్లీనర్లు, ఒక ఫారెస్టు మజ్దూర్ ఉన్నట్టు డా.కె ఎస్.జవహర్ రెడ్డి తెలిపారు.