హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): తిరుమలలో భద్రత కోసం ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అనుసంధానిస్తూ కమాండ్ కంట్రోల రూం ఏర్పాటు చేయాలని తిరుమల భద్రతా కమిటీ ప్రతిపాదించింది. తిరుమలలో తనిఖీలు సమర్థంగా నిర్వహించేందుకు బాడీ స్కానర్స్ను కూడా ఏర్పాటు చేయాలని కమిటీ ప్రతిపాదించింది. తిరుమల భద్రతా కమిటీ ముఖ్య అధికారిగా నియమితులైన హరీశ్కుమార్ గుప్తా తిరుమలలో మంగళ, బుధవారాలో ్ల పర్యటించారు.
బుధవారం ఈ మేరకు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆగమ శాస్త్రం ప్రకారం తిరుమలలో అవసరమైన టెక్నాలజీని ఉపయోగించి ప్రపంచంలోనే అత్యుత్తమ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 15 రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించి, ప్రస్తుతం అమలవుతున్న భద్రతను పరిశీలించి, ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే గుర్తించాలని ఏడు విభాగాల నిపుణుల కమిటీ సభ్యులను హరీశ్కుమార్ గుప్తా ఆదేశించారు.