అమరావతి : పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు ఏర్పాట్లలో నిమగ్నమైన ఓ ఉద్యోగి ప్రమాదవాశాత్తు మృతి చెందాడు. జిల్లాలోని పెనుమంట్ర మండలం కొయ్యేటిపాడు గ్రామంలో సహకార సంఘం ఉద్యోగి టి.చిన్న వెంకటరెడ్డి (36) జెండా ఆవిష్కరణకు ఇనుప గొట్టాన్ని నిలబెడుతుండగా విద్యుత్తు వైర్లకు తగిలి విద్యుదాఘాతానికి గురై తీవ్ర గాయాలతో కిందపడిపోయాడు. అతడిని స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు.