అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ హైదరాబాద్ వెళ్తున్నారు. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ శ్రీరామ నగరంలో జరుగుతున్న శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో జగన్ పాల్గొంటారు. త్రిదండి చిన జీయర్ స్వామి ఆహ్వానం మేరకు జగన్ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలకు వస్తున్నారు.
సోమవారం సాయంత్రం 4 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్కు బయల్దేరి వెళ్తారు. 5 గంటలకు శంషాబాద్ చేరుకుని.. అక్కడి నుంచి ముచ్చింతల్లోని వేడుకల ప్రాంతానికి చేరుకుంటారు. శ్రీ రామానుజుల ఉత్సవాల్లో పాల్గొన్న అనంతరం.. రాత్రి 9 గంటలకు జగన్ తిరుగుప్రయాణమై తాడేపల్లికి చేరుకుంటారు.
విశ్వాసం, కులం, మతంతో పాటు జీవించే అన్ని అంశాలలో సమానత్వం అనే ఆలోచనను ప్రోత్సహించిన శ్రీ రామానుజాచార్య స్మారకార్థం ముచ్చింత్లోని శ్రీరామ నగరంలో నెలకొల్పిన 216 అడుగుల ఎత్తైన సమతా విగ్రహాన్ని శనివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆదివారం నాటి ఉత్సవాల్లో జనసేన పార్టీ అధిపతి, నటుడు పవన్ కల్యాణ్ హాజరై స్వామి వారి ఆశీస్సులు అందుకున్నారు.