అసనీ తుపాను నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం అత్యవసర సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షకు ఏపీ హోంమంత్రి వనిత, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు సంబంధిత విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులు వర్చువల్గా యాడ్ అయ్యారు.
తుపాను సందర్భంగా అధికారులు ఎలాంటి సహాయక చర్యలు తీసుకోవాలి? ఎలా వ్యవహరించాలి? అన్న అంశాలపై సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే తుపాను ప్రభావిత ప్రాంతాలకు సరిపడా నిధులిచ్చామని, తీర ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అయితే.. తుపాను ప్రభావితమైన జిల్లాల ప్రజల విషయంలో అత్యంత మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సీఎం జగన్ సూచించారు. వారికి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా చూసుకోవాలని, పరిహారం విషయంలో ఉదారంగా ఉండాలని సూచించారు. ప్రజలను సహాయక శిబిరాలకు తరలించాలని, కుటుంబానికి 2 వేల చొప్పున ఇవ్వాలని ఆదేశించారు. అలాగే మంచి నీటి సౌకర్యం, జనరేటర్ లాంటి సౌకర్యాలు కూడా కల్పించాలని సీఎం జగన్ ఈ సమావేశంలో సూచించారు.