విజయవాడ: రెండు రోజుల పర్యటన నిమిత్తం పారిస్ వెళ్లిన ఏపీ సీఎం జగన్ ఇవాళ ఉదయం ఏపీకి తిరిగొచ్చారు. తన కుమార్తె గ్రాడ్యుయేషన్ డే వేడుకకు హాజరైన జగన్ దంపతులు.. ఆ కార్యక్రమం ముగియగానే శనివారం ఏపీకి తిరుగుప్రయాణమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదివారం ఉదయం తన ప్యారిస్ పర్యటన నుంచి కుటుంబ సమేతంగా ఏపీకి తిరిగి వచ్చారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు మంత్రి జోగి రమేష్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, ఇతర జిల్లా అధికారులు విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జూన్ 28న ఫ్రాన్స్కు వెళ్లి.. జూలై 2న పారిస్లోని ఇన్సీడ్ (INSEAD) బిజినెస్ స్కూల్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఎంబీఏ) పూర్తి చేసిన తన పెద్ద కుమార్తె హర్షిణి గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు హాజరయ్యారు. తన కుమార్తె విజయవంతంగా ఎంబీఏ పూర్తిచేసినందుకు దేవుడి ఆశీస్సులు ఉంటాయని పేర్కొంటూ ట్విట్టర్లో తమ ఫొటో షేర్ చేశారు.