హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ) : ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రాయి దాడి కేసులో నిందితుడికి విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జికోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి మైనర్ అని నిందితుడి తరపు న్యాయవాది సలీం కోర్టులో వాదించారు.
దురుద్దేశంతోనే రాయితో సీఎంపై దాడి చేశారని పోలీసుల తరపు న్యాయవాది వాదించారు.నిందితుడి పుట్టిన తేదీకి సంబంధించి మున్సిపల్ అధికారులు ఇచ్చిన ధ్రువీకరణపత్రాన్ని పరిగణనలోకి తీసుకొంటామని తెలిపింది. నిందితుడికి మే 2 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.