అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. మూడు రాజధానుల బిల్లును ఏపీ సర్కార్ ఉపసంహరించుకుంది. వీకేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను రద్దు చేస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో మూడు రాజధానుల చట్టానికి సంబంధించిన ఉపసంహరణ బిల్లును శాసనసభలో ఆ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ చట్టాన్ని ఉపసంహరించుకున్నట్లు అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు.