తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కల నెలవేరలేదు. ఇప్పుడున్న పదవీ కాలాన్నే పెంచుతామని, దీంతో సరిపెట్టుకోవాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పినట్లైంది. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రస్తుతం తుడా చైర్మన్గా వున్నారు. ఈయన పదవీ కాలాన్ని మరో 2 సంవత్సరాలకు పెంచుతూ సీఎం జగన్ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయన ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. తిరుపతి జిల్లా కొత్తగా ఏర్పడిన తర్వాత… అక్కడి నుంచి చెవిరెడ్డిని కచ్చితంగా మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న ప్రచారం బీభత్సంగా జరిగింది. చివరికి ఉన్న పదవీ కాలాన్నే మరో రెండేళ్ల పొడిగించినట్లు సీఎం జగన్ ప్రకటించారు.