ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ నెల 11న కేబినెట్ను పునర్ వ్యవస్థీకరించనున్న నేపథ్యంలో కేబినెట్ లోని 24 మంది మంత్రలూ రాజీనామా చేసేశారు. తమ రాజీనామా పత్రాలను మంత్రులందరూ సీఎం జగన్కు అందజేశారు. అయితే.. కేబినెట్ భేటీ సందర్భంగా ఏపీ సీఎం జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును మళ్లీ ఓడించాలని మంత్రులకు సూచించారు.
చంద్రబాబును తిరిగి ఓడించే బాధ్యత మీదే అంటూ మంత్రులకు స్పష్టం చేశారు. ఇక.. వచ్చే ఎన్నికల్లో కూడా బాబును ఓడిస్తే.. రాజకీయంగా తనకు భవిష్యత్ ఉండదని సీఎం నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి రాజీనామా చేసిన మంత్రులను పార్టీ సేవలకు ఉపయోగిస్తామని, జిల్లా అధ్యక్ష బాధ్యతలు కూడా ఇస్తామని జగన్ భరోసా ఇచ్చారు. తమ తమ విశేష అనుభవాన్ని రంగరించి, పార్టీ కోసం పనిచేయాలని సీఎం జగన్ ఈ సందర్భంగా మంత్రులను కోరారు.