అమరావతిలో భూ కుంభకోణంపై కేసు
23న వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలని ఆదేశం
హైదరాబాద్, మార్చి 16, (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరిగిన భూ కుంభకోణానికి సంబంధించి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సీఐడీ నోటీసులు జారీచేసింది. విజయవాడ నుంచి మంగళవారం రెండు బృందాలుగా వచ్చిన సీఐడీ అధికారులు హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని చంద్రబాబు నివాసానికి సెక్షన్ 41సీఆర్పీసీ కింద నోటీసులు అందజేశారు. అమరావతిలో అసైన్డ్ భూముల క్రయ విక్రయాలకు సంబంధించి ఈ నెల 23న ఉదయం 11 గంటలకు విజయవాడలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి విచారణకు రావాలని చంద్రబాబును కోరినట్టు సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ చెప్పారు. ఆ రోజున చంద్రబాబు స్టేట్మెంట్ తీసుకుంటామని తెలిపారు.