Chandrababu | హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు సీఐడీ మరో షాకిచ్చింది. తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాకు సంబంధించిన కేసులో చంద్రబాబును సీఐడీ ఏ2గా చేర్చింది. ఏపీఎండీసీ ఇచ్చిన ఫిర్యాదుతో సీఐడీ అధికారులు ఈ కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా మాజీ మంత్రి పీతల సుజాత, ఏ3గా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఏ4గా మాజీ మంత్రి దేవినేని ఉమ ఉన్నారు.
ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం కలిగించారన్న ఆరోపణపై ఈ కేసు నమోదు చేసినట్టు సీఐడీ పేర్కొంది. ఇప్పటికే చంద్రబాబుపై అమరావతి ఇన్నర్రింగ్ రోడ్, స్కిల్ డెవలప్మెంట్, అసైన్డ్ ల్యాండ్స్, ఫైబర్నెట్ కేసులు విచారణలో ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉ న్న చంద్రబాబు ఆరోగ్య కారణాలపై బె యిల్పై విడుదలైన సంగతి తెలిసిందే. ఆ యన గురువారం హైదరాబాద్లోని ఏఐ జీ దవాఖానలో చికిత్స కోసం చేరారు.