అమరావతి : ఆంధ్రప్రదేశ్కు చెందిన చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు( MLA Srinivasulu) పార్టీ నుంచి సస్పెండ్(Suspend) చేస్తూ వైసీపీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
ఎమ్మెల్యే శ్రీనివాసులు ఆదివారం జనసేన నేత పవన్కల్యాణ్(Pawan Kalyan) ను కలవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. చిత్తూరు అసెంబ్లీ ఇన్చార్జ్గా తనకు కాకుండా విజయానందరెడ్డిని నియమించడంతో శ్రీనివాసులు అసంతృప్తిలో ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వడం లేదన్న సమాచారంతో ఆదివారం పవన్ను కలిసినట్లు సమాచారం.
రెండు రోజుల క్రితం ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా మైలావరానికి చెందిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు.