అమరావతి : ఏపీకి చెందిన చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు(MLA Srinivasulu) గురువారం జనసేన(Janasena) పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కార్యక్రమంలో అధ్యక్షుడు పవన్కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. ఈ సందర్భంగా పవన్కల్యాణ్(Pawankalyan) కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ గత నాలుగేళ్లలో వైసీపీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని పేర్కొన్నారు. రాయలసీమలో గెలిచిన ఒకే ఒక్క బలిజ ఎమ్మెల్యేనైనా తనకు టికెట్ ఇవ్వకుండా వైఎస్ జగన్ అన్యాయం చేశారని ఆరోపించారు.
పార్టీ సిద్ధాంతాలు నచ్చడంతోనే జనసేనాలో చేరానని స్పష్టం చేశారు. చిత్తూరులో జనసేన అభిమానుల ఇళ్లను కూల్చివేస్తుందని ఆరోపించారు. పవన్కల్యాణ్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లా ఒక కుటుంబం చేతిలోనే ఉండిపోయిందని విమర్శించారు. రాయలసీమ(Rayalaseema) ప్రాంతం కొందరి కంబంధ హస్తాల్లో చిక్కుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే ఇంకేమి మిగలదని అన్నారు. రాయలసీమలో అణగారిన వర్గాలకు అండగా ఉంటామని వెల్లడించారు. వైసీపీకి కొమ్ముకాసే పోలీసు అధికారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.