అమరావతి : తమ పిల్లలకు మంచి బుద్దులు నేర్పడానికి తల్లిదండ్రులు చేస్తున్న ప్రయత్నాలు కొన్నిసార్లు వికటిస్తున్నాయి. చదువుకోవాలని మందలించినందుకు పురుగుల మందు తాగిన ఇద్దరు చిన్నారుల్లో ఒకరు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా కొత్తపట్నం అంబేద్కర్ నగర్లో విషాదం చోటు చేసుకుంది.
అంబేద్కర్ నగర్కు చెందిన సుబ్బారావు, మాధవిదంపతులకు వెంకట కల్యాణ్, వెంకట వంశీ అనే ఇద్దరు పిల్లలున్నారు. కల్యాణ్ 10వ తరగతి , వంశీ 9వ తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. చదువు కోకుండా జులాయిగా తిరగవద్దని తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్థాపానికి గురైన ఇద్దరు కూల్ డ్రింక్లో ఎలుకల మందు తాగగా ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వారు వెల్లడించారు.