తిరుచానూరు: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిఆలయంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ గురువారం పూజలు చేశారు. ముందుగా ఆలయ ప్రవేశ ద్వారం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ జేఈవో వీరబ్రహ్మం స్వాగతం పలికారు. పద్మావతి అమ్మవారి దర్శన అనంతరం అర్చకులు వేదశీర్వచనంతోపాటు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందించారు. ఈసందర్భంగా ఆలయ డీఈవో కస్తూరిబాయి తదితరులు పాల్గొన్నారు.