తిరుమల వెళ్లే అలిపిరి నడక మార్గంలో ఈ నెల 24 నుంచి 27 మధ్యలో శ్రీలక్ష్మి నారాయణస్వామి ఆలయం, రిపీటర్ మధ్య ప్రాంతంలో చిరుత, గుడ్డెలుగు తిరుగుతున్నట్టు కెమెరాలో రికార్డు అయిందని టీటీడీ తెలిపింది.
కావున నడకదారి భక్తులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. భక్తులు గుంపులు, గుంపులుగానే వెళ్లాలని సూచించింది.